హాస్పిటల్ బాత్రూమ్‌లో ఉరేసుకున్న కరోనా మహిళా రోగి

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు అందరినీ కలవరపెడుతున్నాయి. మూడు వారాలకు పైగా దేశమంతా లాక్‌డౌన్‌లో కొనసాగుతున్నా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. కరోనా పాజిటివ్ వచ్చిన రోగులు కూడా తీవ్ర మానసిక వేదనకు గురవుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని ముంబయికి చెందిన మహిళా రోగి హాస్పిటల్ బాత్‌రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది


ముంబయికి చెందిన మహిళ(29) కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను నగరంలోని బివైఎల్ నాయర్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ఆమె బాత్‌రూమ్‌కి వెళ్లింది. ఆమె ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన వైద్య సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా కిటికీకి చున్నీతో ఉరేసుకుని కనిపించింది.